చాణుక్యుడు ఆర్థికశాస్త్రంలో గొప్ప పండితుడుగా ప్రసిద్ధి పొందారు. చాణుక్యనీతి సూత్రాలు నేటి సమాజానికి ఆచరణీయం.
- ధనవంతులు కావడానికి కష్టపడి పనిచేయడం అనేది చాలా ముఖ్యం అని ఆచార్య చాణుక్యుడు చెప్పారు. తన లక్ష్యం కొరకు కష్టపడి పనిచేసే వ్యక్తి తప్పకుండా జీవితంలో విజయం సాధిస్తారు .
- ధనవంతులు కావాలని భావించే వాళ్లు వృథాగా ధనాన్ని ఖర్చు చేయకూడదు. ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం వల్ల నష్టం వస్తుంది అని గుర్తుఉంచుకోవాలి. ధనాన్ని సరియైన ప్రణాళికతో ఖర్చు పెట్టనట్లైతే, అది పేదరికానికి కారణం అవుతుంది.
- వ్యక్తి ధనం సంపాదించిన తర్వాత ఆ ధనాన్ని ఎలా ఆదా చెయ్యాలి అనే విషయం మీద సరియైన అవగాహన ఉండాలి. ధనాన్ని ఒకేచోట పొదుపు చేసినిట్లయితే కూడా నష్టపోయే ప్రమాదం వుంది.
- ధనం విషయంలో దురాశ పనికిరాదు. దురాశ వున్నవారు ఎంతకైనా దిగజారుతారు. ధనం ఉందని అహం కలిగిన వ్యక్తులు జీవితంలో ముందుకు’వెళ్ళలేరు. తన వారందరికీ దూరం అవుతారు. ధనం సంపాదించడానికి తప్పుడు మార్గం ఎన్నుకున్నవాడు జీవితంలో ఎదగలేరు.
- ఏ వ్యక్తి అయినా తనకు రావలసిన ధనాన్ని తీసుకునేందుకు సిగ్గుపడకూడదు. అలా ధనాన్నితీసుకోవడానికి సిగ్గు పడితే ఆ వ్యక్తి నష్టపోతాడు. తన స్వంత ధనాన్ని కూడా నష్టపోతాడు. ఆ వ్యక్తి క్రమంగా పేదరికంలోకి జారే పరిస్థితి వస్తుంది. ప్రతి వ్యక్తి తన రాబడి ఖర్చుల విషయంలో’ఖచ్చితమైన విధానాన్ని అవలంభించాలి.
- ఒక వ్యక్తి తన జీవితంలో విజయం, సంపద సాధించాలంటే అతను క్రమశిక్షణతో కూడిన జీవనశైలిని అనుసరించాలి. ప్రతిపనిని క్రమశిక్షణతో సమయానికి పూర్తిచేసే వ్యక్తిని మాత్రమే విజయం వరిస్తుంది. తద్వారా ధనంకూడా సంపాదించగలుగుతాడు.
- ఒక వ్యక్తి విజయం సాధించాలి అంటే అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వస్తుంది. సవాళ్ళను ధైర్యంగా ఎదుర్కునే వ్యక్తికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది.
ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా ఎక్కువ మొత్తంలో ధనాన్ని సంపాదించడం సాధ్యమవుతుందని చాణక్యుడు తన సూత్రాలద్వారా తెలియజేసారు.
(Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసం, మరియు అందుబాటులో వున్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది.)