Digital Rupee

డిజిటల్ (కరెన్సీ)దిశగా భారత్ ఆర్ధికరంగం అడుగులు

రిజర్వుబ్యాంకు భారతదేశంలో సొంత డిజిటల్ కరెన్సీ  త్వరలో తీసుకురానుంది. ఆర్ధికరంగంలో సరికొత్త మార్పులను తీసుకుని వచ్చే క్రమంలో,  డిజిటల్ కరెన్సీని  ప్రారంభిస్తున్నామని  రిజర్వుబ్యాంకు గవర్నర్ శక్తి కాంతా దాస్ ప్రకటించారు. డిజిటల్ రూపీ  ట్రయల్స్ ఈ ఏడాది డిసెంబర్ లో ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం వున్న కరెన్సీనోట్స్, నాణాలకు ఆన్ లైన్ రూపంగా డిజిటల్ రూపీ ఉంటుందని స్పష్టంచేశారు.   సెంట్రల్ బ్యాంకు డిజిటల్ కరెన్సీలు (CBDC)గా పేర్కొనే ఈ డిజిటల్ కరెన్సీ ఆన్ లైన్ లో చట్టబద్ధంగా చెల్లుబాటు అవుతుందని ఆయన వెల్లడించారు.

డిజిటల్ కరెన్సీ అనేది మనదేశం లో పూర్తిగా  కొత్త అంశం కాబట్టి రిజర్వు బ్యాంకు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది అని రిజర్వుబ్యాంకు గవర్నర్ స్పష్టం చేశారు .